ఈ బ్లాగు రాయడం మీద ఇష్టం నాకు రోజురోజుకీ పెరిగి పోతోంది. వచ్చిన ప్రతి ఆలోచననూ ఒడిసిపట్టుకొని దాన్ని బ్లాగులో పెట్టొచ్చా లేదా అని అలోచిస్తూంటే, చివరికి దాన్ని రాసినా రాయకపోయినా, ఆ ఆలోచన మాత్రం నన్ను నేను మరలా మరొక్కసారి తరచి చూసుకొనే అవకాశాన్ని కలిగిస్తోంది. ఏదో పరాకు లో ఉన్నప్పుడో, డ్రైవ్ చేస్తున్నప్పుడో ఎన్నో ఆలోచనలు. ఒకప్పుడు అవి చాలా వరకు అలా వచ్చి ఇలా వెళ్ళేవే. బ్లాగు పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఆలోచనని మధిస్తుంటే నాకు బ్లాగు రాయడానికి మించిన ఆనందం కలుగుతోంది. ఎన్నో జ్ఞాపకాలు, తారసపడే ఎందరో వ్యక్తులు, ఎక్కడో మొదలయ్యే జీవితం. చాలా దూరం వచ్చామని తెలుస్తుంది గాని ఎంతదూరం వచ్చామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో అంతకంటే తెలీదు.
నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.
భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.
నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.
మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.
మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.
ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.
నా చిన్నప్పుడు మా అమ్మకంటే ముందు మా బాగోగులు చూసిన వ్యక్తి ఒకరున్నారు. ఆమే మా అవ్వ. మా నానమ్మ వాళ్ళమ్మ. నేను పుట్టే టప్పటికే తనకి దాదాపు ఎనభై యేళ్ళుంటాయేమో. అప్పటికే ఆమెకి ఏదో వ్యాధి వచ్చి నడుం వంగిపోయింది. నడుము నుంచి మొహం వరకు నేలకు సమాతరం గా ఉంచి నడిచేది. మేము తనముందే ఆమెలా నడిచి ఆమెను ఆట పట్టించేవాళ్ళం. మేము ఆట పట్టిస్తున్నా కూడా చిర్నవ్వు తో అలా మమ్మల్ని చూస్తూ మురిసిపోయేది. కోపం అనేది తన మొహంలో చూసి ఎరగను నేను. చిన్నతనం, తెలిసీ తెలియని వయసు. అయినా నాకెందుకో ఇప్పుడు ఆమెనలా ఆటపట్టించటం గుర్తుకువస్తే ఏదో క్షమార్హం కాని నేరం చేసాననిపిస్తోంది. ఆమెకి మేమే లోకం. మా బాగోగులే ఆమెకి దినచర్య. మా నలుగురు పిల్లలకి స్నానాలు చేయించటం, బట్టలు తొడగడం, అన్నం తినిపించటం, మాతో ఆడుకోవడం ఇవే ఆమె ప్రధాన వ్యాపకాలు.
భోజనాల దగ్గర అవ్వను నేను తెగ విసిగించేవాడిని. చెప్పాను కదా ఆమె అలా వంగి నడుస్తూ ఉంటే నేనువింతగా చూసే వాడినని. మా భోజనాల గది వంటిల్లు వేరు వేరు గా ఉండేవి.నేను మొదట అవ్వా పప్పు కావాలి అనేవాడిని, అది తేగానే ఈసారి నెయ్యి, ఆ తరువాత ఇంకేదో. ఇలా అన్నీ ఒక్కసారే అడగకుండా ఆమెని ముప్పు తిప్పలు పెట్టేవాడిని. ప్రతిసారి ఆమె నేనడిగింది తేవటానికి వెనక్కి మళ్ళగానే నేను ఎక్కిరింతగా నవ్వుతూ మిగతా పిల్లలకి చూపించి నవ్వేవాడిని ఎలా నడుస్తోందో చూడండి అని. నేనడిగిన ప్రతిసారి విసుక్కోకుండా పాపం రెండు గడపలు దాటి మరీ వెళ్ళి తీసుకొచ్చేది.గడప దాటడం చాలా కష్టం ఆమెకి, పైగా అవి ఎత్తు గడపలు.రెండు చేతులతో ద్వారం తాలూకు నిలువు బద్ద ని పట్టుకొని ఆ ఊతంతో దాటాల్సొచ్చేది.
నాకు నాలుగైదేళ్ళున్నప్పుడే తను చనిపోయింది. మా ఇంటి పంచలో ఉంచారు ఆమె నిర్జీవ శరీరాన్ని. నాకేమాత్రం ఏడుపు రాలేదు. అలా వింతగా చూస్తూ ఉన్నానంతే. నాకు మూడు పూటలా అన్నం పెట్టి, నా ఆలనా పాలనా చూసిన ఆ చెయ్యి అలా నిర్జీవం గా పడి ఉంటే నాకేమాత్రం కనీసం దిగులు కూడా అనిపించలేదు. ఏదో జరిగిందని తెలుసు, ఏమిటో తెలీదు.
అందరిపిల్లల్లొకి ఆమెకి నేనంటే ఎక్కువ ఇష్టమట. తను చనిపోయిన తరువాత కూడ నేను నాకు అవ్వే అన్నం పెట్టాలి అని ఏడుస్తుంటే మావాళ్ళు భయపడి ఏవో పూజలు పునస్కారాలు చేసారట.
మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న ని అడిగాను అవ్వతాలూకు ఫోటో ఎక్కడైనా దొరుకుతుందా అని. నా ఆశ అడియాశే అయ్యింది. మా బంధువుల ఇళ్ళళ్ళో ఉండే అవకాశం కూడా లేదంట.
మరణానంతరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు కదా. తను మరలా ఎక్కడైనా పుట్టిందో తెలీదు, లేదా పైన వుండి నన్ను అలా విస్తుపోతూ చూస్తూ ఉందో తెలీదు. ఈ ఒక్కమాట చెప్పాలని ఉంది. నిన్ను మర్చిపోయినా, పూర్తిగా మాత్రం మర్చిపోలేదు, అప్పుడప్పుడూ గుర్తొస్తూనే ఉంటావూ అని చెప్పాలని ఉంది.
ఈ ఉరుకులు పరుగులు ఎందాకో , ఏమి సాధిద్దామనో తెలీదు గానీ , ఈ పరుగుపందెం లో నేను మరచిపోయిన నా మొట్టమొదటి జ్ఞాపకం మా అవ్వ.